Sunday, May 19, 2024

ఐదు తెలుగు చిత్రాల్లో..

ఐదు తెలుగు సిినిమాలకి సంతకం చేశానని చెప్పింది బాలీవుడ్ బ్యూటీ ఆదాశర్మ.  ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో న‌టించేలా త‌నను ప్రోత్స‌హిస్తున్న మేక‌ర్స్ కు ధ‌న్య‌వాదాలు తెలిపింది ఆదాశ‌ర్మ‌. క్ష‌ణం చిత్రం ఐదేళ్లు పూర్తి చేసుకుంది. నేను కొత్త‌గా ఐదు తెలుగు సినిమాల‌కు సంత‌కం చేశా. ప్ర‌తీ సారి భాష ఏదైనా కొత్త ప్ర‌యోగాత్మ‌క ప్రాజెక్టులు చేసేందుకు మీరంతా నాపై ప్రేమ చూపిస్తూ..మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. నేనిపుడు చేస్తున్న సినిమాలు అన్ని హంగుల‌తో గ‌తంలో చేయ‌ని విధంగా ఉంటాయి. శ్వేత‌, అడివిశేష్‌, ర‌వి పేరెపు, పీవీపీ సినిమాస్ కు ధ‌న్య‌వాదాలు అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది ఆదాశ‌ర్మ‌. థ్రిల్ల‌ర్ ఫిలిమ్‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన క్ష‌ణం బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఈ చిత్రాన్ని త‌మిళంలో స‌త్య‌, హిందీలో బాఘీ 2, క‌న్న‌డ‌లో ఆద్య పేరుతో రీమేక్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement