Sunday, May 19, 2024

ఏడాది పూర్తి చేసుకున్న ‘హిట్’..సీక్వెల్ రానుందట

హిట్ చిత్రం రిలీజ్ అయి ఆదివారం ఫిబ్రవరి28కి ఏడాది పూర్తయింది. హిట్ చిత్రానికి సీక్వెల్ ఉందని తెలిపారు నేచురల్ స్టార్ హీరో నాని. హిట్ చిత్రం రిలీజ్ అయి ఆదివారం ఫిబ్రవరి 28కి ఏడాది పూర్తియింది. కాగా నటుడిగా..నిర్మాతగా ముందుకు దూసుకెళుతున్న నాని తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ పై హిట్ అనే సినిమాని నిర్మించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు  శైలేష్ తెలరకెక్కించారు. కాగా ఈ మూవీలో హీరోగా ఫలక్ నుమా దాస్ ఫేమ్ విశ్వక్ సేన్..రుహానీశర్మ జంటగా నటించారు.క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డ‌మే కాక ప‌లు జాతీయ అవార్డులు కూడా అందుకుంది. నేటితో హిట్ చిత్రం విడుద‌లై ఏడాది పూర్తయిన  సంద‌ర్భంగా నాని త‌న ట్విట్టర్‌లో హిట్ మూవీకి సీక్వెల్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. హిట్ చిత్రం తెలంగాణ నేప‌థ్యంలో సాగ‌గా, సీక్వెల్ ఏపీ నేప‌థ్యంలో ఉంటుంద‌ట‌. ఇందులో “కేడీ” అనే రోల్ ను కూడా హైలైట్ చేస్తున్నాడు. సీక్వెల్ కోసం విశ్వ‌క్ సేన్‌ను కాకుండా అడివి శేష్‌ని హీరోగా తీసుకోవాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది .

Advertisement

తాజా వార్తలు

Advertisement