Friday, May 3, 2024

అద్భుతమైన పాత్రలు చేయాలనేది నా కల..’అనసూయ’

యంగ్ హీరో కార్తికేయ..లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చావు కబురు చల్లగా చిత్రంలో అనసూయ మాస్ నెంబర్ వేసిందని ఇటీవల చిత్ర మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాలలోనే కాక మరికొన్ని  సినిమాలలోను అన‌సూయ స్పెష‌ల్ సాంగ్స్ చేయ‌నుంద‌నే వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దీనిపై స్పందించిన అన‌సూయ‌.. ఎలాంటి స్పెష‌ల్ సాంగ్స్ చేయ‌డం లేదు. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రంలోని పాట‌ను నా ఫ్రెండ్ జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేయ‌డంతో స్పెష‌ల్ సాంగ్ చేసేందుకు ఆస‌క్తి చూపాను.  వెండితెర‌పై అద్భుత‌మైన పాత్ర‌లు చేయాల‌నేది నాక‌ల‌ అంటూ అన‌సూయ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement