Thursday, April 25, 2024

వై సిరీస్‌లో 55 వన్‌ ప్లస్‌ 4కే టీవీ.. మార్కెట్‌లోకి రిలీజ్ చేసిన కంపెనీ

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల సంస్థ వన్‌ప్లస్‌ మరో కొత్త టీవీని భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. వై సిరీస్‌లో 55 అంగుళాల 4కే టీవీని ఆవిష్కరించింది. వన్‌ప్లస్‌ 55 వై1ఎస్‌ ప్రో పేరుతో దీనిని తీసుకొచ్చింది. దీని ధరను రూ.39,999గా నిర్ణయించింది. ఇది ఒఎస్‌ 10తో పనిచేస్తుంది. 4కే స్క్రీన్‌ కలిగిన ఈ టీవీ 100 కోట్ల కలర్స్‌ను సపోర్టు చేస్తుంది. బెజెల్‌ లెస్‌ డిజైన్‌ ప్రత్యేకార్షణ. ఈ టీవీతోపాటు డాల్బీ ఆడియోతో కూడిన 24డబ్ల్యు స్పీకర్స్‌ను కూడా అందిస్తున్నారు. ఆక్సిజన్‌ 2.0తో యాప్‌ ద్వారా అనేక స్మార్ట్‌ ఫీచర్లు అందిస్తున్నారు. నిర్ణీత సమయం తర్వాత టీవీని ఆఫ్‌ చేయడం, రిమోట్‌గా కిడ్స్‌ మోడ్‌ను నియంత్రించడం వంటి ఫీచర్లు ఉన్నాయి.

అలాగే వన్‌ప్లస్‌కు చెందిన బడ్స్‌, స్మార్ట్‌వాచ్‌లను సులువుగా ఈ టీవీకి కనెక్ట్‌ చేసుకోవచ్చు. దాదాపు 230 ఛానళ్లను ఇందులో ఉచితంగా వీక్షించే సౌలభ్యం ఉంది. నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, స్పాటిపై, జీ5 వూట్‌ వంటి 17 యాప్స్‌ ఇందులో ఇమిడివుంటాయి. డిసెంబర్‌ 13నుంచి విక్రయాలను ప్రారంభిస్తున్నారు. ఐసీఐసీఐ కార్డు దారులకు రూ.3000 డిస్కౌంట్‌ లభించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement