Monday, May 6, 2024

ఊగిసలాడిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. భారీ నష్టాలతో రోజును ప్రారంభించిన మార్కెట్లు చివర్లో కాస్త కోలుకుని స్వల్ప నష్టాలతో రోజును ముగించాయి. రోజంతా నష్టాల్లోనే ట్రేడ్ అయిన మార్కెట్లు చివర్లో కాస్త కోలుకున్నాయి. కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుండడంతోపాటు కీలక బ్యాంకింగ్‌ రంగం‌లోని షేర్లు డీలా పడడం దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. టీసీఎస్ టెక్ మహీంద్రా లాభాలు ఆర్జించగా.. ఇండస్ ఇండ్ బ్యాంక్ పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఐసీఐసీఐ బ్యాంక్ టాటా మోటార్స్ నష్టాలను చవిచూశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement