Friday, May 3, 2024

ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

వేములవాడ: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు జయంతి వేడుకలను వేములవాడ పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పులి రాంబాబు, పట్టణ అధ్యక్షులు ముప్పిడి శ్రీధర్‌లు మాట్లాడుతూ ఎన్టీ రామారావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటు-పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంబాబు గౌడ్‌, ముప్పిడి శ్రీధర్‌, ఉమేందర్‌ గౌడ్‌, రమణాయాదవ్‌, వలీ అహ్మ్‌, తవుటు సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement