Sunday, April 28, 2024

రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్‌ల రెండో దశ విక్రయం.. లాటరీ దరఖాస్తు గడువు నవంబర్‌ 2కు పొడిగింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ బండ్లగూడ, పోచారంలలోఉన్న రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్‌ల విక్రయానికిగాను నిర్వహించే రెండవ దశ లాటరీకి దరఖాస్తు గడువును హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ) పొడిగించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ లాటరీకి దరఖాస్తు గడువు బుధవారంతో ముగిసింది. అయితే తాజాగా ఈ గడువును నవంబర్‌ 2 దాకా పొడిగించినట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది.

ఈ ప్రాజెక్టుల్లో ఉన్న త్రీ బీహెచ్‌కే, టూ బీహెచ్‌కే, వన్‌ బీ హెచ్‌కే ఫ్లాట్‌ల కొనుగోలుకు విశేష స్పందన వస్తుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. జూన్‌లో నిర్వహించిన తొలి దశ లాటరీలో ఇప్పటికే చాలా వరకు ఫ్లాట్లు అమ్ముడయ్యాయని, రెండవ దశ లాటరీలో కొన్ని ఫ్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement