Friday, May 17, 2024

ఆగస్టు10న శాంసంగ్ కొత్త ఫోల్డ్‌, ప్లిప్‌ ఫోన్ల ఆవిష్కరణ..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఆగస్టు 10, 2022న గెలాక్సీని విడుదల చేయు సందర్భంగా కొత్త టెక్నాలజీలు, ఉత్పత్తులను ప్రదర్శించబోతోంది. మార్ఖీ ఈవెంట్‌ ముందు రాబోతుండగా, శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్రెసిడెంట్‌, ఎంఎక్స్‌ బిజినెస్‌ హెడ్‌ డా. టిఎం రోహ్‌ ప్రజల జీవితాల్ని మెరుగుపరచే టెక్నాలజీని రూపొందించడానికి శాంసంగ్‌ ధ్యేయం గురించి మాట్లాడారు. తాము 2019లో మొట్ట మొదటి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌ ని విజయవంతంగా పరిచయం చేశామన్నారు.

అప్పటినుండీ మన పరిశ్రమ భవిష్యత్తును మార్చివేశామన్నారు. గత సంవత్సరం, ప్రపంచ వ్యాప్తంగా 10 మిలియన్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్లను తాము సరఫరా చేయగలిగామన్నారు. అది 2020 నుండి పరిశ్రమ పెరుగుదల 300శాతం కంటే ఎక్కువగా ఉందని, ఈ వేగవంతమైన ఎదుగుదల కొనసాగుతుందని తాను అనుకుంటు-న్నానన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement