Thursday, May 2, 2024

ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్ల కొనుగోలు చేయనున్న రిలయన్స్‌

ఈ సంవత్సరం కొత్తగా ఎఫ్‌ఎంసీజీ బిజినెస్‌లోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించిన రిలయన్స్‌ ఆ దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. రిలయన్స్‌ ఇప్పటికే ప్యూర్‌ డ్రింక్స్‌ గ్రూప్‌కు చెందిన సాఫ్ట్‌ డ్రింక్‌ బ్రాండ్‌ కంపాను కొనుగోలు చేసింది. తాజాగా కెవిన్‌ కేర్‌ నుంచి గార్డెన్‌ నమ్కీన్స్‌, లహోరీ జీరా, బిందూ బెవరేజెస్‌ను కూడా కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీనిపై ఆయా కంపెనీల యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.
కంపా బ్రాండ్‌ను 22 కోట్లకు రిలయన్స్‌ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. దీపావళి నాటికి కంపా డ్రింక్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement