Monday, April 29, 2024

RBI: నాలుగో సారి కీలక వడ్డీ రేట్లు యథాతథం…గృహ రుణదారులకు ఊరట..

ముంబయి: అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ నేతృత్వంలో పరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను శుక్రవారం ప్రకటించారు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్‌ఎఫ్‌, బ్యాంక్‌ రేట్‌ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. వడ్డీ రేట్లను మార్చకుండా అలాగే కొనసాగించడం వరుసగా ఇది నాలుగోసారి. దీంతో గృహ రుణాలను తీసుకున్న వారికి కాసింత ఊరట లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement