Monday, May 6, 2024

Ola | ఓలా ఈవీ ఫెస్టివ‌ల్.. పండ‌క సీజ‌న్ లో అధిరిపోయె ఆఫ‌ర్లు !

దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఓలా భారత్ ఈవి (EV) ఫెస్ట్‌ని ప్రకటించింది. పండగ సీజన్ కోసం దేశం సన్నద్ధమవుతున్న తరుణంలో.. ఓలా భారతదేశంలోనే అతిపెద్ద టూవీల‌ర్ ఈవి ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్, లాభదాయకమైన డిస్కౌంట్‌లు, బ్యాటరీ హామీ పథకాలు, మరెన్నో అద్భుతమైన ఆఫర్‌లతో పాటు కస్టమర్ల ముందుకు వచ్చింది.

ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. “అందరూ పండగ సీజన్ కు సమిష్టిగా సిద్ధమవుతున్న వేళ, భారత్ ఈవి(EV) ఫెస్ట్‌ను ప్రారంభించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. 2W సెగ్మెంట్‌లో #EndICEAge నిబద్ధతతో కట్టుబడి ఉన్నాము. అందులో భాగంగానే మేము ఈ వేడుకను ప్రకటించాము. భారత్ ఈవి(EV) ఫెస్ట్ తో ప్రజలు ఈ దివాళీ పండుగ సందర్బంగా ఈవి(EV)కి మారడానికి సరైన అవకాశం మరియు వారు మా ఎక్స్పీరియన్స్ కేంద్రాలను సందర్శించి, ఓలా స్కూటర్లను టెస్ట్ రైడ్ చేయవచ్చు” అన్నారు.

ఇక ఈ ఫెస్ట్‌లో భాగంగా, కొనుగోలుదారులు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై 24,500 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. 5 సంవత్సరాల బ్యాటరీ వారంటీ (రూ.7,000 వరకు విలువైనది), ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు (రూ.10,000 వరకు), నో-కాస్ట్ EMI వంటి ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ పథకాలు కస్టమర్లు పొందవచ్చు. ఈ ఫెస్ట్ కాలంలో ఓలా స్కూటర్‌ని టెస్ట్-రైడింగ్ చేసే కస్టమర్‌లు ఇతర అద్భుతమైన బహుమతులతో పాటు ప్రతిరోజూ ఒక S1 X+ని గెలుచుకునే అవకాశాన్ని పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement