Tuesday, May 7, 2024

విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాక్

బ్యాంకులను నిలువునా కోట్లాది రూపాయలకు ముంచేసి పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు లండన్ కోర్టు మంగళవారం షాక్ ఇచ్చింది. లండన్ హైకోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేసిన విజయ్ మాల్యాకు చుక్కెదురైంది. లండన్ హైకోర్టు భారతదేశంలో మాల్యా ఆస్తిపై ఇంతకు ముందు విధించిన భద్రతా కవర్ ను ఉపసంహరించుకుంది. దీనితో, ఎస్బీఐ నేతృత్వంలోని భారత బ్యాంకుల కన్సార్టియం మాల్యా నుండి రుణాన్ని రికవరీ చేయడానికి అవకాశం ఏర్పడింది. భారతదేశంలో మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ద్వారా మూసివేసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాన్ని ఇప్పుడు భారత బ్యాంకులు తిరిగి పొందగలవు.

మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాలంటూ ఎస్బీఐ తదితర బ్యాంకుల కన్సార్టియం తమ గత పిటిషన్ కు సవరణ కోరాయి. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి మైఖేల్ బ్రిగ్స్ సమర్థించారు. మాల్యా కేసుకు సంబంధించి నేడు వర్చువల్ విధానంలో విచారణ చేపట్టారు. భారత్ లోని మాల్యా ఆస్తులపై బ్యాంకుల సెక్యూరిటీ మొత్తాల మాఫీకి జడ్జి మైఖేల్ బ్రిగ్స్ మార్గం సుగమం చేశారు. భారత్ లో ఇలాంటి సెక్యూరిటీ మొత్తాల మాఫీని నిలువరించే విధానమేదీ లేదని బ్యాంకులకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. తుది విడత వాదనలు వినేందుకు జూలై 26న తదుపరి విచారణ చేపట్టాలని ధర్మాసనం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement