Monday, May 6, 2024

ఈక్విటీలపై పెరిగిన ఆసక్తి.. యాక్సిస్‌ ఎంఎసీ ఈక్విటీస్‌ మేనేజర్‌ కార్తీక్‌కుమార్‌

ఈక్వీటీలు, బ్యాలెన్స్‌ఫండ్స్‌, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌, నాన్‌ ఫైనాన్షియల్‌ ఎస్సెట్స్‌పై ప్రతి ఒక్కరు దృష్టి సారిస్తున్నారని యాక్సిస్‌ ఎంఎసీ ఈక్విటీస్‌ మేనేజర్‌ కార్తీక్‌కుమార్‌ తెలిపారు. ఇంతకుముందు ఈక్విటీ విభాగంలో సెక్టోరియల్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌పై తక్కువ దృష్టి సారించేవారని యాక్సిస్‌ ఎంఎంసీ పోర్ట్‌ఫోలియో ఈక్విటీస్‌ మేనేజర్‌ కార్తీక్‌ వివరించారు. 2021 మార్కెట్‌ గణాంకాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసినట్లు తెలిపారు. క్యాప్‌ ఎక్స్‌పోజర్‌ అనేది లార్డ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌లను తెలియజేస్తుంది. లాంగ్‌టర్మ్‌ విశ్లేషణలను పరిగణనలోకి తీసుకుంటే 2021నుంచి కొన్ని అస్థిర పరిస్థితులు ఎదురయ్యాయి. మదుపరులు తమ సంపాదనలో అధిక మొత్తాన్ని ఈక్విటీలు, ఫిక్స్ డ్‌ ఇన్‌కమ్‌ వచ్చే వనరులపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని కార్తీక్‌ కుమార్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement