Monday, May 6, 2024

వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ, పీఎన్‌బీ

ఆర్బీఐ రెపోరేటు పెంచిన వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లు రెపో ఆధారిత రుణాల వడ్డీరేట్లు పెంచుతున్నట్లు ప్రకటించాయి. రెపో ఆధారిత రుణాల వడ్డీ రేటును పంజాబ్‌ నేషల్‌ బ్యాంక్‌ 7.40 శాతం నుంచి 7.90 శాతానికి పెంచింది. పెంపుదల ఈ నెల 8 నుంచి అమల్లోకి వస్తుందని పీఎన్‌బీ ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ వడ్డీరేట్లను 9.10 శాతానికి పెంచింది. ఈ నిర్ణయం శుక్రవారం నుండే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ బాటలోని మరిన్ని బ్యాంక్‌లు వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉంది. రుణాలపై వడ్డీరేట్లను పెంచడంతో పాటు, కొన్ని బ్యాంక్‌లు డిపాజిట్లపై కూడా వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement