హైదరాబాద్ : శక్తివంతమైన, ఔత్సాహిక భారతీయ వినియోగదారులకు, జీవనశైలి స్ఫూర్తిని పెంచేందుకు ఆకర్షణీయమైన ఉత్పత్తి శ్రేణిని అందించే ప్రయత్నంలో, ఇసుజు తన సుసంపన్నమైన వ్యక్తిగత ప్యాసింజర్ పికప్లను పరిచయం చేసింది. ఇవి భారతదేశం కోసం భారతదేశంలో తయారు చేయబడినవి. భారతదేశంలో మార్గదర్శకంగా ఉన్న జీవనశైలి పిక్-అప్ విభాగంలో ట్రెండ్ను సెట్ చేయడానికి ఇసుజు నిబద్ధతను నేటి ఆవిష్కరణ వెల్లడిస్తుంది. సరికొత్త వి -క్రాస్ 4×4 టాప్ వేరియంట్లు ఎక్సటెరియర్ ల పరంగా సొగసైనప్పటికీ ఇంకా క్లాస్సి ఎలిమెంట్లను కలిగి ఉండి, ఆకర్షణీయతను పెంచుతాయి. ముదురు బూడిద రంగులో స్టైలింగ్ అంశాలు ఫినిషింగ్ కలిగి ఉండటంతో ఈ కాలాతీత ఆకర్షణ సాధించబడింది. ఇవి సూక్ష్మమైనప్పటికీ విజువల్ డైనమిజమ్ని, వైవిధ్యమైన రోడ్ ఉనికిని కలిగి ఉండటం చేత ఈ వాహనాలు మరింత దూకుడుగా కనిపించినప్పటికీ ఇంకా స్పోర్టీగా ఉంటాయి.
ఈ ఆవిష్కరణపై ఇసుజు మోటార్స్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ టోరు కిషిమోటో మాట్లాడుతూ… “భారతదేశంలో మొట్టమొదటి లైఫ్స్టైల్ అడ్వెంచర్ యుటిలిటీ వెహికల్ అండ్ మా ప్యాసింజర్ వాహనాల శ్రేణి పికప్లను అందించడంలో బెంచ్మార్క్ సెట్ చేసినందుకు మేము గర్విస్తున్నాము. విడుదల చేసినప్పటి నుండి నిలకడగా ఇవి వినియోగదారుల నడుమ మంచి ఆదరణ పొందాయి. ఈ సక్సెస్ స్టోరీని ముందుకు తీసుకెళ్లడం సంతోషంగా ఉంది. ఈ సుసంపన్నమైన ఆకాంక్షాత్మక ఉత్పత్తులతో, అభివృద్ధి చెందుతున్న ప్రగతిశీల భారతీయ కస్టమర్ల అవసరాలను తీర్చగలమని, ఈ విభాగంలో మా స్థానాన్ని మరింత బలోపేతం చేయగలమని మేము విశ్వసిస్తున్నాము. తాజా శ్రేణి ఇసుజు ప్యాసింజర్ పికప్లు మా విలువైన కస్టమర్లకు అత్యుత్తమ డిజైన్, పనితీరు, వైవిధ్యత , నాణ్యత, భద్రత, డ్రైవింగ్ సౌకర్యాలతో విలువ ప్రతిపాదనను నిజంగా మెరుగుపరుస్తాయి…” అని అన్నారు.