Sunday, April 28, 2024

Elon Musk | రెండు లక్షలకుపైగా ఎక్స్‌ ఖాతాలపై నిషేధం

దేశంలో ఎక్స్‌ యూజర్లకు ఎలాన్‌ మస్క్‌ షాకిచ్చారు. భారత్‌లోని రెండు లక్షల మందికిపైగా యూజర్ల ఖాతాలను ‘ఎక్స్‌ కార్ప్‌’ బ్లాక్‌ చేసింది. పిల్లలపై లైంగిక దాడులు, అశ్లిdలత, ఉద్రిక్తతలను ప్రోత్స#హంచే కంటెంట్‌ కట్టడిలో భాగంగా మార్చి నెలలో ఏకంగా 2,12,627 ఖాతాలపై నిషేధం విధించినట్లు ప్రకటించింది. ఫ్రిబవరి 26 నుంచి మార్చి 25 వరకు భారతీయ సైబర్‌స్పేస్‌లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేసినందుకుగాను 1,235 ఖాతాలను తొలగించినట్లు తెలిపింది.

కొత్త ఐటీ నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నట్లు తన నెలవారీ నివేదికలో పేర్కొంది. మొత్తంగా ఈ రిపోర్టింగ్‌ సైకిల్‌లో దేశవ్యాప్తంగా 2,13,862 ఖాతాలపై నిషేధం విధించినట్లు పేర్కొంది. భారతీయ వినియోగదారుల నుంచి 5,158 ఫిర్యాదులు అందాయని, తమ గ్రీవెన్స్‌ రెడ్రెసల్‌ మెకానిజం ద్వారా వాటిని పరిష్కరించామని వెల్లడించింది. వాటిలో ఎక్కువగా నిషేధాన్ని తప్పించుకోవడం (3,074), అడల్ట్‌ కంటెంట్‌ (953), విద్వేశాన్ని రెచ్చగొట్టడం (412), వేధింపులకు (359) సంబంధించినవి ఉన్నాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement