Sunday, April 28, 2024

భారతీయ విద్యార్థులకు 30వేల వీసాలు: ఫ్రాన్స్‌

2030 నాటికి భారత్‌ నుంచి 30,000 మంది విద్యార్థులను ఆహ్వానించాలని ఫ్రాన్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ పారిస్‌ను సందర్శించిన దాదాపు నెల రోజుల తర్వాత ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన తర్వాత, భారతదేశంలోని ఫ్రెంచ్‌ రాయబార కార్యాలయం ఎక్కువ మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి ఐదేళ్ల షార్ట్‌-స్కెంజెన్‌ వీసాతో సహా అనేక చర్యలను రూపొందించింది.

మోడీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపరిచే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. విద్యార్థుల ప్రయోజనం కోసం ఫ్రెంచ్‌ భాష, ఇతర విద్యా విభాగాలలో సమగ్ర శిక్షణను అందించే ప్రత్యేక కార్యక్రమం ”అంతర్జాతీయ తరగతులను” సృష్టిస్తుందని రాయబార కార్యాలయం తెలిపింది.

- Advertisement -

ఫ్రాన్స్‌ ఎల్లప్పుడూ మీ స్నేహితుడిగా ఉంటుంది. మీరు మా దేశంలో అద్భుతమైన విద్యాసంబంధమైన జీవితానుభవాన్ని కలిగి ఉండేలా మేము చేయగలిగినదంతా చేస్తాము” అని భారతదేశంలోని ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్‌ లెనైన్‌ అన్నారు. ఫ్రెంచ్‌ రాయబార కార్యాలయం అక్టోబర్‌ నెలలో చెన్నై, కోల్‌కతా, ఢిల్లి, ముంబైలలో ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ను కూడా నిర్వహించనుంది. 40కి పైగా ఫ్రెంచ్‌ ఉన్నత విద్యాసంస్థల ప్రతినిధులు భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సరైన కోర్సును ఎంచుకునేలా సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు రాయబార కార్యాలయం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement