Sunday, May 5, 2024

Yuvagalam Last Day …లోకేష్ తో అడుగులేసిన నారా, నంద‌మూరి కుటుంబాలు

విశాఖ‌ప‌ట్నం – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. గాజువాక నియోజకవర్గం శివాజీ నగర్‌లో నేటి సాయంత్రంతో పాదయాత్ర ముగియనుంది.పాదయాత్ర చివరిరోజైన సోమవారం గాజువాక నియోజకవర్గం సీడబ్ల్యూసీ-1 నుంచి పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా నారా వారి కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నారా లోకేష్ త‌ల్లి భువ‌నేశ్వ‌రి, అత్త వ‌సుంద‌ర‌, తో పాటు భార్య బ్ర‌హ్మ‌ణి, ఇత‌ర స‌భ్యులు నారా లోకేష్ తో పాటు అడుగులు వేశారు..

కాగా, చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న లోకేశ్‌ యువగళం ప్రారంభమైంది. 226 రోజులుపాటు కొనసాగిన ఈ పాదయాత్ర నేటి సాయంత్రం అగనంపూడి వద్ద ముగియనుంది. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండంలలోని పోలిపల్లి వద్ద యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ జరగనుంది. ఈ ముగింపు సభకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులతోపాటు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement