టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. ‘ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు వల వేస్తే పడలేదు. ఇప్పుడు సోనూ సూద్ కు గాలం వేశాడు. నిస్వార్థ సేవా కార్యక్రమాలతో ఆయన సంపాదించుకున్న మంచి పేరులో ఎంతో కొంత కొట్టేయొచ్చన్నది బాబు ప్లాన్. త్వరలోనే వీళ్ల సంగతి ఆయనకు తెలియక పోదు. ఇమేజి పెంచుకోవడానికి అడ్డదారులుండవు బాబూ’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
కాగా,ఇటీవల ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధులు, పలు రంగాల నిపుణులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల వర్చువల్ పద్ధతిలో మాట్లాడిన విషయం తెలిసిందే. ఇందులో సినీనటుడు సోనూసూద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. త్వరలోనే కలిసి ప్రజాసేవకు ఐక్య కార్యాచరణ రూపొందిద్దామని సూచించగా సోనూసూద్ అందుకు సరే అన్నారు. కరోనా కారణంగా ఎంతోమంది అనాథులుగా మారిన విషాధ ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయని గుర్తుచేసిన చంద్రబాబు వీటన్నింటిపైనా తోచిన విధంగా స్పందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.