Sunday, April 28, 2024

Alur: మళ్లీ వైసీపీదే అధికారం.. మంత్రి జయరామ్

ఆలూరు ప్రభ న్యూస్….: రాష్ట్రంలో మళ్లీ వైసీపీ పార్టీనే అధికారంలోకి వస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. సంక్షేమ పథకాలు వివరిస్తూ, సమస్యలను తెలుసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమంలో సర్పంచ్ కొల్లమ్మ ఆధ్వర్యంలో మంత్రి గుమ్మనూరు జయరామ్, నియోజకవర్గ నారాయణస్వామి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండల పరిధిలోని అడవి గోన హల్ గ్రామం నందు రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన గోడౌన్ ను ప్రారంభించారు. మనేకుడితి గ్రామం నందు గడపగడప కార్యక్రమంలో గడపగడపకి వెళ్లి సంక్షేమపై వివరిస్తూ… గత నాలుగేళ్ల నుండి పది కోట్ల 60 లక్షల వరకు ఈ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి శేఖర్, ఎంపీపీ తనయుడు వీరేష్, మండల నేత వీరేష్, వైస్ ఎంపీపీ భర్త శ్రీధర్, సర్పంచులు దేవిరెడ్డి, సుధాకర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు దీపక్, రామ్ భీం నాయుడు, వీరభద్ర రెడ్డి, శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో అల్ల బకేష్, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై డాక్టర్ నాయక్, కార్యకర్తలు, తదితర ప్రభుత్వం అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement