Thursday, May 2, 2024

నాకు సెక్యూరిటీ ఇవ్వ‌డం లేదు: వివేకా కేసు అప్రూవ‌ర్ ద‌స్త‌గిరి ఆందోళ‌న‌

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు డ్రైవర్ దస్తగిరి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుకు నివేధించినట్లుగా జిల్లా పోలీసులు తనకు రక్షణ కల్పించడం లేదన్నారు. సరైన విధంగా రక్షణ కల్పించలేదని, పులివెందుల దాటి వెళితే తన వెంట సెక్యూరిటీ ఎవరూ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన గన్ మెన్లు ఇద్దరు తనతో ఉండటం లేదని ఆరోపించారు. ప్రతిసారీ సీబీఐ అధికారులకు ఫోన్ చేసుకుని సెక్యూరిటీని పంపమని కోరడం ఇబ్బందిగా ఉందన్నారు. తనకు ప్రాణానికి హాని జరిగితే తిరిగి తీసుకుని వస్తారా ? అని ప్రశ్నించారు. స్ధానిక పోలీసులు తన కదలికలు తెలుసుకుంటున్నారు తప్ప.. నాకు రక్షణగా ఉన్నట్లు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement