Sunday, May 5, 2024

మ‌ద్యం తాగి డ్యూటీకి వ‌చ్చిన ఉపాధ్యాయుడు.. విద్యార్థుల‌తో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌..

జనగామ: విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాల్సిన ఉపాధ్యాయుడే బాధ్యతలు విస్మరించాడు. పిల్లల‌ను సక్రమమార్గంలో పెట్టాల్సిన గురువే తన ఉన్నతిని మరచి మద్యం సేవించి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. కాగా, శనివారం విచారణ నిమిత్తం నోడల్ అధికారిగా సత్యనారాయణ రాజేందర్ విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లల‌ను చదువుల కోసం పంపిస్తే విద్యాభ్యాసం నేర్పవలసిన ఉపాధ్యాయులే మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తిస్తున్నార‌ని, అట్లాంటి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. అయితే.. విచారణ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై జిల్లా విద్యాధికారికి నివేదిక పంపిస్తాన‌న్నారు.

పాఠశాల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
Advertisement

తాజా వార్తలు

Advertisement