Monday, April 29, 2024

వైఎస్​ వివేకా మ‌ర్డ‌ర్ కేసు.. దస్తగిరి, రంగన్న ప్రొటెక్ష‌న్‌కు గన్‌మెన్‌ల నియామకం

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బాబాయ్ అయిన‌ వైఎస్‌ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక సాక్షులుగా ఉన్న‌ దస్తగిరి, రంగన్నకు మంగళవారం నుంచి భద్రతలో భాగంగా గన్‌మెన్‌లను నియమించారు. కడప కోర్టు ఆదేశాల మేరకు వ‌న్ ప్లస్‌ గన్‌మెన్‌లను పోలీసు శాఖ కేటాయించింది. మరోవైపు ఏ5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వరాదంటూ వివేకా కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. తన వాదనలను వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement