Friday, May 3, 2024

YS Viveka Murder Case: మా నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసు.. అవినాష్‍ బీజేపీలో చేరతాడు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐకి సునీతరెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో అంశాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.  అంశాలు తమ నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసని… నాన్న హత్యపై భారతి, జగన్ చాలా తేలిగ్గా స్పందించారని వాంగ్మూలంలో సునీతా రెడ్డి పేర్కొన్నారు. నాన్న హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు బాధించాయని, హత్య గురించి అనుమానితుల పేర్లను జగనన్నకు చెప్పానని తెలిపారు. వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు.. నీ భర్తే హత్య చేయించాడేమో అని అన్యాయంగా మాట్లాడారని ఆమె పేర్కొంది. కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్‍కు ఏమీకాదని.. బీజేపీలో చేరతాడని జగన్‌ తనకు చెప్పినట్లు సునీతా రెడ్డి తెలిపింది.

ఇప్పటికే మా పై 11 కేసులున్నాయి.. మీది 12వ ది అవుతుందన్నారని పేర్కొన్నారు. తన తండ్రి హత్యను జగన్ రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారన్న సునీత – సీబీఐ విచారణ కోసం తాను కోర్టుకు వెళ్తే జగన్ రాజకీయ భవిష్యత్తు.. నాశనమయ్యే ప్రమాదం ఉందని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల అన్నారని వెల్లడించింది. అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిల డైరెక్షన్‍లో ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు.  అవినాశ్‍రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్‍ రెడ్డిలతో పాటు మరికొందరు అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయని తలిపారు. నా తండ్రి అంటే ఎంపీ అవినాశ్‍కు గిట్టదని.. అందుకే హంతకులకు శిక్ష పడాలని.. గత్యంతరం లేక సీబీఐని ఆశ్రయించానని సునీత రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement