పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలంలో ప్రేమించిన యువతి మాట్లాడడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీకి అశోక్ కుమార్ అనే యువకుడు పి.నారాయణపురం గ్రామానికి చెందిన ఓ యువతితో గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. అయితే ఇటీవల ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. దీంతో ఆమె అశోక్ ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసింది. దీంతో మనస్థాపానికి గురైన అశోక్.. గత సోమవారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించి కుటుంబ సభ్యులు వెంటనే జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement