Wednesday, April 24, 2024

వీధి కుక్కల వేటలో జింక మృతి

వీధి కుక్కల వేటలో మచ్చల జింక మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టలో చోటుచేసుకున్నది. అనంతగిరి గుట్ట దేవాలయం సమీపంలో కుక్కలు గుంపుగా జమై జత కట్టి అడవిలో తిరుగుతున్నాయి. అడవిలో కనిపించిన మూగ జీవులను వెంటాడి పీక్కు తింటున్నాయి. ఈ క్రమంలో ఆదివారం కుక్కలు గుంపు జింకను వెంబడించాయి. గమనించిన కొందరు స్థానికులు, బర్డ్స్ వాచర్స్ కుక్కల వేట నుండి జింకను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే జింక మృతి చెందింది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారికి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన జింకను అటవీశాఖ సిబ్బంది తీసుకువెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement