Saturday, May 4, 2024

Young Man Died : వినాయకుడి మండ‌పంలో డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి..

వినాయ‌కుడి మండ‌పంలో డ్యాన్స్ చేస్తూ యువ‌కుడు మృతిచెందిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో చోటుచేసుకుంది. డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పట్టణంలోని మారుతి నగర్‌లో రాత్రి వినాయకుని మండపం ముందు ప్రసాద్ (26) అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు.

చుట్టుపక్కల ఉన్న జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు.. ఇంతలో ప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. అతడు గుండెపోటుతో కన్నుమూసినట్లు గుర్తించారు. అప్పటి వరకు హుషారుగా డ్యాన్స్ చేస్తూ సందడి చేసిన ప్రసాద్ చనిపోవడాన్ని స్నేహితులు, స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. యువకుడి మరణంతో స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement