Sunday, May 5, 2024

వైసీపీ మ‌హిళా నేత సెల్వి మౌన‌దీక్ష‌..

చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో వైసీపీ మహిళా నేత, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ సెల్వి మౌనదీక్ష కు కూర్చున్నారు. మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్‌ వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం ఎదుట ఆమె మౌనదీక్ష చేపట్టారు. సీఎంతో తప్ప తాను ఎవరితోనూ మాట్లాడబోనని ఆమె నిరసన వ్య‌క్తం చేస్తున్నారు. ఈసంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ…. పార్టీలో తనకు కనీస మర్యాద కూడా ఇవ్వటం లేదని వాపోయారు. సీఎం జగన్‌తో తప్ప తాను ఎవరితోనూ మాట్లాడబోనన్నారు. త‌న‌కు పార్టీలో గుర్తింపులేదని, స్థానిక నాయకులు కనీస మర్యాద ఇవ్వడంలేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను పార్టీకి విధేయురాలునని, తన సమస్యలను ముఖ్యమంత్రికి మాత్రమే తెలియజేస్తానన్నారు. సీఎం జగన్‌తో తప్ప తాను ఎవరితోనూ మాట్లాడబోనని భీష్మించుకుని కూర్చున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement