Thursday, May 9, 2024

కార్తీక మాసం: శివాలయాలకు పోటెత్తిన భక్తులు

కార్తీక మాసం తొలి రోజు సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోని శివుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు భారీ సంఖ్యలో మల్లికార్జునస్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. సామూహిక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్తికమాసోత్సవాల సందర్భంగా శ్రీగిరీశుడు మల్లికార్జున స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement