Sunday, April 28, 2024

YCP Third List – అరు ఎంపి, 15 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ ఛార్జ్ లు వీరే

అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా మూడో జాబితాను విడుదల చేసింది వైఎస్సార్‌సీపీ పార్టీ. ఆరు పార్లమెంట్‌ స్థానాలకు తాడేపల్లిలో గురువారం పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ఆ వివరాలను మీడియాకు తెలియజేశారు.

విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మీ, విజయవాడ ఎంపీగా కేశినేని నాని, కర్నూల్‌ ఎంపీగా గుమ్మనూరి జయరాం, తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం, ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌లకు అవకాశం కల్పించారు. ఇక.. ఇచ్చాపురం పిరియ విజయ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్‌, మదనపల్లె నిస్సార్‌ అహ్మద్‌, రాజంపేట ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఆలూరు బూసినే విరూపాక్షి, కోడుమూరు(ఎస్సీ) డాక్టర్‌ సతీష్‌, గూడురు మేరిగ మురళి, చింతలపూడి కంభం విజయరాజు, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, పెనమలూరు జోగి రమేష్‌, పూతలపట్టు మూతిరేవుల సునీల్‌కుమార్‌, పెడన ఉప్పాల రాములను ఇన్‌ఛార్జిలుగా నియమించారు.

తొలి జాబితాలో 11 నియోజకవర్గాల్లో, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో జాబితాను 21 స్థానాలతో విడుదల చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement