Tuesday, April 30, 2024

అయ్యన్నపాత్రుడు తాగుబోతు: టీడీపీ నేతపై విజయసాయి ఘాటు వ్యాఖ్య

టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. అయ్యన్నపాత్రుడు తాగుబోతు అని… ఆయన భూమికి భారంగా మారాడని ఆయన వ్యాఖ్యానించారు. తెల్లవారి లెగిస్తే, ఏం పని లేక విమర్శలు చేయడం తప్పితే, ఆ ప్రాంతానికి గాని రాష్ట్రానికి గాని ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఆయన కుమారులు నిరుద్యోగులుగానే ఉన్నారని.. వస్తే వారికి కూడా ఉపాధి కల్పిస్తామని అన్నారు. జాతీయ రాజకీయాలపై, రాష్ట్రానికి ఎవరు ప్రయోజనం చేకూర్చే వారితోనే తాము వెళ్తామని స్పష్టం చేశారు. అది ఎప్పుడో తీసుకున్న నిర్ణయం అలాగే ముందుకు వెళ్తామని, ఆ నిర్ణయంపై ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. పబ్లిక్, ప్రైవేట్ రంగంలో కలిపి ఉపాధి కల్పించామని విజయసాయి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement