Sunday, April 28, 2024

AP: న‌ర్సారావుపేట నుంచే పోటీ … జ‌గ‌న్ కు తేల్చి చెప్పిన ఎంపి శ్రీకృష్ణదేవరాయలు

ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు ధిక్కార స్వ‌రం..
న‌ర్సారావుపేట సీటు ఇవ్వాల్సిందే..
గుంటూరు నుంచి పోటీ చేసేది లే..
అభ్య‌ర్ధిత్వం ఖ‌రారు చేయ‌కుంటే రాజ‌కీయాల‌కు గుడ్ బై ..

రాబోయే ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో వైసీపీ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను మారుస్తుండటం తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకి అదే స్థానం నుంచి టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిరాకరించారు.


గుంటూరు నుంచి పోటీ చేయాలని ఆయనకు సూచించారు. అయితే, తాను గుంటూరు నుంచి పోటీ చేయలేనని జగన్ కు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. నరసరావుపేట ఎంపీ స్థానం నుంచే లావుకు టికెట్ ఇవ్వాలని ఆ నియోజకవర్గ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం చెప్పినప్పటికీ జగన్ నిరాకరించారు. దీంతో గుంటూరు నుంచి తాను పోటీ చేయలేనని, ఎన్నికల్లో పోటీ నుంచి తాను తప్పుకుంటానని లావు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement