Thursday, May 9, 2024

వైసిపి ఎమ్మెల్యే పార్ధ‌సార‌థికి గుండెపోటు…

విజ‌య‌వాడ -మాజీ మంత్రి, పెనుమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారథి గుండెపోటుకు గుర‌య్యారు. దీనితో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటీన అశోక్ నగర్ లోని టాప్ స్టార్ హాస్పిటల్ కు తరలించారు. ఎమ్మెల్యేకు పరీక్షలు చేసిన వైద్యులు యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం పార్థసారథి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పార్థసారథిలో గుండెపోటు రావడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కుంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement