Thursday, May 16, 2024

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం: నాదేండ్ల మనోహర్​

ప్ర‌జాస్వామ్యాన్ని కాల‌రేసే విధంగా వైసీపీ పాల‌న సాగుతోంద‌ని, అధికారంలో ఉన్నాం క‌దా అని ఏది మాట్లాడితే అది చెల్లుతుంది అనుకుంటే పొర‌పాటేన‌న్నారు జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదేండ్ల మ‌నోహ‌ర్‌. వారి అహంకారానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లే బుద్ధి చెబుతార‌ని ఇవ్వాల (శనివారం) మీడియాకు పంపిన లేఖ‌లో తెలియ‌జేశారు. ‘‘వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా మళ్లీ అధికారంలోకి రాదు. ఫలితాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉండేది ఖాయం. కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడింది చూశాను. ఆయన మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇంత అహంకారం ఎక్కడ నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. ఆయన పెద్దఎత్తున ప్రగల్భాలు పలుకుతున్నారు. మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని వ్య‌క్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. గతంలో కూడా అనవసరంగా ఇలాంటి సమస్యలే సృష్టించారు. మా నాయకత్వాన్ని చులకన చేసే విధంగా మాట్లాడితే సహించేది లేదు. శాసన సభ్యుడిగా సమయం వృథా చేసుకోకుండా కాకినాడ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. పేదలకు ఇస్తామన్న ఇళ్ల పట్టాలపై మాట్లాడండి. డంపింగ్ యార్డుల్లా మారిన మత్స్యకార గ్రామాల గురించి మాట్లాడండి, పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై మాట్లాడండి. అని సూచించారు నాందేడ్ల మ‌నోహ‌ర్‌.

శశిధర్ చేతిలో ద్వారంపూడి ఓటమి తప్పదు..
ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న వైసీపీకి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా ప్రజలే బుద్ధి చెబుతార‌న్నారు జ‌న‌సేన నాయ‌కుడు నాదేండ్ల మ‌నోహ‌ర్‌. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకొని, కాకినాడ అభివృద్ధికి సమయం కేటాయిస్తే ప్రజలు కొంతవరకైనా హ‌ర్షిస్తార‌ని సూచించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ద్వారంపూడి గెలిచే పరిస్థితి లేదని.. ఆయనపై ముత్తా శ‌శిధ‌ర్ ఘ‌న విజయం సాధించి తీరుతార‌ని పేర్కొన్నారు. ‘‘మా పార్టీ నాయకులు ఆ ప్రాంతంలో బలంగా పనిచేస్తున్నారు. గతంలో మా వీర మహిళలను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాయపరిచాడు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వాళ్లు ఇంటింటికీ వెళ్లి ప్రజల ద్వారా సరైన గుణపాఠం చెబుతారు” అని లేఖ ద్వారా స్పస్టం చేశారు నాదేండ్ల.

Advertisement

తాజా వార్తలు

Advertisement