Sunday, April 28, 2024

AP: పవన్, షర్మిలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

సీఎం జగన్‌ను కించపరిచేలా మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న షర్మిల, టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవన్‌ నరసాపురం, భీమవరం సభల్లో సీఎం జగన్‌పైన, వైఎస్సార్‌సీపీ నేతలు ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, సజ్జల రామకృష్ణారెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి వివేకానందరెడ్డి హత్య గురించి బహిరంగ సభల్లో పదేపదే తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలి’అని ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement