Sunday, May 19, 2024

AP | వైసీపీ రెండో జాబితా విడుదల.. 27 స్థానాల్లో అభ్యర్థుల మార్పు

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పార్టీలో భారీగా మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. పలు స్థానాల్లో ఇప్పటికే మార్పులు చేశారు జగన్. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించారు.

మరికొన్ని చోట్ల ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు. ఇప్పటికే 11 చోట్ల మార్పులతో వైసీపీ తొలి జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీలో మార్పులు చేర్పులకు సంబంధించి రెండో జాబితా వచ్చేసింది. 27 మంది ఇంఛార్జ్ లతో సెకండ్ లిస్ట్ విడుదల చేసింది వైసీపీ.

వైసీపీ విడుదల చేసిన సెకండ్ లిస్ట్ అభ్యర్థులు వీరే..

  • అనంతపురం ఎంపీ -మాలగుండ్ల సత్యనారాయణ
  • హిందూపురం ఎంపీ- జోలదరాశి శాంత
  • అరకు ఎంపీ- కొట్టగుల్లి భాగ్యలక్ష్మి
  • రాజాం- తాలే రాజేశ్
  • అనకాపల్లి- మలసాల భరత్ కుమార్
  • పాయకరావుపేట- కంబాల జోగులు
  • రామచంద్రాపురం- పిల్లి సూర్యప్రకాశ్
  • పి.గన్నవరం- విప్పర్తి వేణుగోపాల్
  • పిఠాపురం- శ్రీమతి వంగ గీత
  • జగ్గంపేట- తోట నరసింహులు
  • ప్రత్తిపాడు- పరుపుల సుబ్బారావు
  • రాజమండ్రి సిటీ- మర్గాని భరత్
  • రాజమండ్రి రూరల్ -చెల్లబోయిన గోపాల కృష్ణ
  • పోలవరం-తెల్లం రాజ్యలక్ష్మి
  • కదిరి- బి.ఎస్. మక్బూల్ అహ్మద్
  • ఎర్రగొండపాలెం- తాటిపర్తి చంద్రశేఖర్
  • తిరుపతి- భూమన అభినయ్ రెడ్డి
  • గుంటూరు ఈస్ట్- షేక్ నూరి ఫాతిమా
  • మచిలీపట్నం- పేర్ని కృష్ణమూర్తి
  • చంద్రగిరి- చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
  • పెనుకొండ-కె.వి. ఉషా శ్రీచరణ్
  • కల్యాణదుర్గం- తలారి రంగయ్య
  • అరకు- గొడ్డేటి మాధవి
  • పాడేరు-విశ్వేషర రాజు
  • విజయవాడ సెంట్రల్- వెల్లంపల్లి శ్రీనివాస రావు
  • విజయవాడ వెస్ట్ -షేక్ అసిఫ్
Advertisement

తాజా వార్తలు

Advertisement