Sunday, April 28, 2024

గజరాజు బీభత్సం.. మహిళ మృతి

విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. కొమరాడ మండలం పాతకల్లికోట గ్రామం సమీపాన పొలంలోని ఏనుగుల దాడిలో అల్లాడ అప్పమ్మ అనే మహిళ మృతి చెందింది. పొలానికి వెళ్లిన మహిళను ఏనుగులు తొక్కి చంపాయి.  అప్పమ్మ మృతితో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో చాలా మంది చనిపోతున్నారని అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement