Saturday, April 20, 2024

తెలంగాణ బీజేపీలో లుకలుకలు..మాట్లాడే అవకాశం ఇవ్వలేదని బండి సంజయ్ పై అరవింద్ ఫైర్..

తెలంగాణ బీజెేపీ నేతల మధ్య మనస్పర్థలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నిన్న జూమ్ యాప్ లో రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించారు…అందులో మాట్లాడేందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తనకు అవకాశమివ్వలేదని తెలుస్తోంది. దీంతో ధర్మపురి అరవింద్ బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనకు కు మాట్లాడే అవకాశం ఇవ్వనపుుడు ఎందుకు నన్ను సమావేశానికి పిలిచారని సంజయ్ పై ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు అసంతృప్తితో, ఆగ్రహంతో మధ్యలోనే సమావేశం నుంచి వైదొలిగారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ పరిణామం ఇప్పుడు తెలంగాణ బిజెపి వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఆదరణ పెంచుకుంటున్న తరుణంలో ఈ పరిణామాలు బిజెపి నాయకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయట.

Advertisement

తాజా వార్తలు

Advertisement