Monday, May 6, 2024

రాఖీ కట్టిన రెండు గంటలకే మృతి చెందిన చెల్లి

రాఖీ పండగ రోజు అన్నకు రాఖీ కట్టిన కాసేపటికే ఓ చెల్లెలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషాద సంఘటన విజయవాడలోని అరండల్‌పేటలో జరిగింది. రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్లిన సోదరుడికి తన చెల్లి చనిపోయిందన్న విషయం తెలిసి నిశ్చేష్టులయ్యారు. తిరిగి వచ్చేసరికి మార్చురీ బాక్సులో పెట్టిన మృతదేహాన్ని చూసి భోరుమన్నారు.

 ప్రసాదంపాడుకు చెందిన ఉష (23) రెండేళ్ల క్రితం అరండల్‌పేటకు చెందిన ఫణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్త మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తుండగా, ఉష సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో చెల్లెలి ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకుని ఉష సోదరుడు సూర్యనారాయణ వెళ్లాడు. అయితే, రెండు గంటల్లోనే ఉష చనిపోయిందని సమాచారం ఇచ్చారు. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నావంటూ తన సోదరిని అత్తింటివారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసేవారని ఉష సోదరుడు సూర్యనారాయణ ఆరోపించారు. ఈ ఘటనపై సూర్యారావుపేట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నారు. కాగా, రాఖీ పండగ నాడే చెల్లెలు చనిపోవడంతో ఆ కుటుంబలో విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement