Thursday, April 25, 2024

అనుమానాస్పద మృతి కేసు: ప్రియుడే హంతకుడు

హైదరాబాద్​ నగర శివారు చందానగర్‌లోని లాడ్జిలో ఓ యువతి అనుమానాస్పద మృతిగా కేసును.. పోలీసులు హత్యగా నిర్ధారించారు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన నాగ‌చైత‌న్య అనే యువ‌తి ఒంగోలులోని ఓ ఆస్ప‌త్రిలో న‌ర్సుగా పని చేస్తోంది. ఈ నెల 23న ఒంగోలు వాసి కోటిరెడ్డితో కలిసి చందానగర్​లోని లాడ్జికి వెళ్లింది.  ఆ త‌ర్వాత ప్రియురాలిని చంపిన కోటిరెడ్డి.. లాడ్జి గ‌దికి తాళ‌మేసి పారిపోయాడు. విష‌యాన్ని గ‌మ‌నించిన లాడ్జి సిబ్బంది.. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు వ‌చ్చి ఆ గ‌ది త‌లుపులు తెరిచి చూడ‌గా యువ‌తి చ‌నిపోయి ఉంది. తనని పట్టుకుంటారని భావించిన కోటిరెడ్డి గాయాలు చేసుకుని ఒంగోలు ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు వెల్లడించారు.

కేసు తప్పుదోవ పట్టించేందుకు కోటిరెడ్డి గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాని… పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేయసి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని నమ్మించాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు తెలిపాడు. కోటి రెడ్డి ఇచ్చిన సమాచారంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చందాన‌గ‌ర్ పోలీసులు ఒంగోలు చేరుకుని కోటిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: సామాన్యుడిని పెళ్లాడిన రాజకుమారి.. రాచ‌రిక‌పు హోదాకు దూరం!

Advertisement

తాజా వార్తలు

Advertisement