Sunday, May 5, 2024

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. కూతురును చూడ్డానికి వెళ్తుండ‌గా యాక్సిడెంట్‌

ఆదోని రూరల్, (ప్రభ న్యూస్) రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన ఏపీలోని క‌ర్నూలు జిల్లా ఆదోని మండలంలో జ‌రిగింది. ఆలూరు మండలం హత్తిబెళగల్ గ్రామానికి చెందిన లక్ష్మి( 40) శుక్రవారం ఉదయం తన కూతురుని చూడడానికి దొడ్డి బెలగల్ గ్రామానికి తన కుమారుడు శ్రీనివాసులుతో మోటార్ వేహిక‌ల్‌పై బయలుదేరింది. ధనాపురం గ్రామం సమీపంలో బైక్‌ అదుపుతప్పి లక్ష్మి కింద పడిపోయింది. తీవ్ర‌గాయాల‌తో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ చ‌నిపోయిన‌ట్టు డాక్ట‌ర్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement