Friday, April 26, 2024

ఏపీలో రోజుకో అత్యాచారం, కౌలు రైతుల ఆత్మహత్యలు.. జగన్ రెడ్డి పాలనకు ఇదే నిదర్శనం: జ‌న‌సేన‌

కర్నూలు, (ప్రభ న్యూస్ బ్యూరో) : రోజుకో అత్యాచారం.. కౌలు రైతుల ఆత్మహత్యలు.. ఇవీ జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర దుస్ధితికి నిద‌ర్శ‌నం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి పరిపాలనా దక్షతతోపాటు పాలన మీద ఆసక్తి , చొరవ కూడా క‌రువ‌య్యాయ‌య‌ని విమ‌ర్శించారు. అందువల్లే రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3వేల మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడితే వారిని ఆదుకోలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కాగా, వారికి భరోసా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన జ‌న‌సేన అధినేత‌ పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలకు దిగడం సిగ్గుచేటన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన 130 మంది కౌలు రైతుల కుటుంబాలకు భరోసా నింపేందుకు ఈ నెల 8వ తేదీన‌ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement