Tuesday, May 7, 2024

రిజైన్ చేస్తావా.. చస్తావా..? గొడ్డలితో వ్య‌క్తి హల్ చల్

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామ సచివాలయం వద్ద బుధవారం ఒక వ్యక్తి గొడ్డలితో హల్ చల్ చేసాడు. దీంతో సచివాలయం సిబ్బంది భయంతో పరుగులు తీశారు. లింగాలపాడు గ్రామానికి చెందిన చిరుమామిళ్ళ సుబ్బారావు అనే వ్యక్తి మద్యం సేవించి సచివాలయం వద్దకి గోడ్డలి తీసుకొని రావడంతోనే సచివాలయ సిబ్బంది, వార్డ్ వాలంటరీ భయ బ్రాంతులకు గురై పరారయ్యారు. గ్రామంలో వార్డు వాలంటరీగా పని చేస్తున్న తన భార్యను గత కొంతకాలంగా ఉద్యోగానికి రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నాడు. మాట వినకపోవడంతో మద్యం సేవించి సచివాలయానికి గోడ్డలి తీసుకొని వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement