Wednesday, May 22, 2024

భార్యే హంతకురాలు.. పోలీసులు విచారణలో సంచలన విషయాలు

ప్రకాశం జిల్లా నుంచి వచ్చి ఓ వ్యక్తి అనంత లోకాలకు చేరుకున్న సంఘటన చేసుకుంది. ఈ మధ్య అక్రమ సంబంధాలు హత్యలకు దారి తీస్తున్నాయి. ఏదో ఒక కేసులో భార్య చేతిలో భర్త.. భర్త చేతిలో భార్య తనువులు చాలిస్తున్నారు. ఇలాంటి సంఘటనే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పొదిలి మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన వేణు… రూతమ్మ దంపతులు గత కొంతకాలం క్రితం నుంచి వచ్చి కొందుర్గు మండల కేంద్రంలో ఉంటూ కూలినాలి పనులు చేయడంతోపాటు. మేస్త్రి పనులు చేసి బ్రతికేవారు. అయితే రూతమ్మ అనే మహిళకు వేరే వ్యక్తితో అక్రమ తమ సంబంధాలు ఉన్నాయి. వేరే వ్యక్తితో చాలా తన సంబంధాలు కాలం కొనసాగిస్తుంది. దీంతో ఒకరోజు భర్త వేణు వీరి అక్రమ సంబంధం పసిగట్టడంతో వీళ్ళ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ సంఘటనతో భార్య రూతమ్మ పక్కాగా ప్లాన్ చేసింది. అదునుచూసి తన ప్రియుడు శ్రీనుతో కలిసి మేడనులిమి చంపేసింది. ప్రియుడి మోజులో పడి  భార్యనే భర్త ను హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానించారు. పలు కోణంలో దర్యాప్తు చేపట్టిన కొందుర్గు పోలీసులు భార్యనే..ప్రియుడితో కలిసి హత్య చేసినట్లుగా కేసును నమోదు చేశారు. దీంతో ఇరువురి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement