Saturday, May 11, 2024

పాముకాటుతో భార్య మృతి, విషమంగా భర్త పరిస్థితి…

కర్నూలు జిల్లాలోని సి.బెళగల్ మండలం, గుండ్రేవులలో విషాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుండ్రేవుల గ్రామంలో మిద్దెపై నిద్రిస్తున్న దంపతులు లక్ష్మీ, భాస్కర్లను విష సర్పం కాటు వేసింది. దీంతో భార్యాభర్తలు ఇరువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పామును చూసిన వారు వెంటనే కేకలు వేయడంతో బంధువులు మిద్దెపైకి వెళ్లి పామును గుర్తించి చంపివేశారు. అనంతరం భార్యాభర్తలను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోలుకోలేక భార్య మృతిచెందగా, భర్త పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement