Friday, May 3, 2024

వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి.. వైసీపీ

దెందులూరు, ప్రభ న్యూస్ : వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలను చేసిన పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైయస్సార్సీపి జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా ఏసుబాబు, చల్ల మేరీ రాజు డిమాండ్ చేశారు. దెందులూరు వైయస్సార్ జగనన్న బస్టాండ్ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహించారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న తమపై నీచమైన వ్యాఖ్యలు చేయడం పవన్ కు తగదని పితాపు పలికారు.

అనంతరం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు క్షమాపణ చెప్పకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏఎంసి డైరెక్టర్ పులిపాటి శ్యామలాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పులిపాటి ఆనంద్, వైఎస్ఆర్ సీపీ నాయకులు కట్ట వెంకటసుబ్బారావు, నాయుడు, గణపతి, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement