Sunday, April 28, 2024

Eluru: గురుకుల పాఠశాల విద్యార్థి ఆత్మహత్య

దెందులూరు, ప్రభ న్యూస్ : ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెదవేగి డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే… ఏలూరు జిల్లా పెదవేగి మండలం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కమలేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

క‌మ‌లేష్‌ ది భీమడోలు గ్రామం. మృతిచెందిన విద్యార్థి కమలేష్ ను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పెదవేగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement