Saturday, May 4, 2024

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : వేసవికాలం ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఏలూరు వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నగర పాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గురువారం ప్రారంభించారు. నిత్యం బాటసారులతో రద్దీగా ఉండే ప్రాంతమైన జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి మెయిన్ గేట్ సమీపంలో రెడ్ క్రాస్ మెడికల్ షాప్ ఎదురుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చుతున్న రెడ్ క్రాస్ సంస్థ వారిని మేయర్ నూర్జహాన్ పెదబాబు అభినందించారు. వేసవికాలం ఎండలు రోజురోజుకు పెరుగుతున్న కారణంగా ఇంకా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నగరంలో పలు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మేయర్ నూర్జహాన్ పెదబాబు కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్ పెదబాబు, రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ బీ.వీ కృష్ణారెడ్డి, సెక్రటరీ బిన్నీ, నాగరాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement