Tuesday, April 30, 2024

Breaking | డివైడర్‌ని ఢీకొన్న కారు… ఇద్దరు మృతి

ఏలూరు క్రైమ్‌, (ప్రభ న్యూస్): ఏలూరు జిల్లాలో యాక్సిడెంట్ జ‌రిగింది. పెదపాడు మండలం వట్లూరు వైపు నుండి గుడివాడ వెళుతున్న కారు కలపర్రు టోల్ ప్లాజా వద్దకు వచ్చేసరికి డివైడర్‌ని ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరని ప్రభుత్వ ఆసుపత్రి మార్చరకి తరలించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement