Sunday, April 28, 2024

పెళ్లి పేరు చెప్పి రెండు సార్లు గర్భవతిని చేసిన యువకుడు..

పెళ్లి పేరుతో ఓ యువతిని రెండు సార్లు గర్భవతిని చేసిన ఘటన విశాఖలో జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జగదీశ్వర రావు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గత సంవత్సరం ఆగస్టులో బాధిత యువతిని బలవంతంగా మానభంగం చేశాడు జగదీశ్వర రావు. అంతేకాదు తన సెల్ ఫోన్ లో వీడియో, ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని వేధించేవాడు.

ఈ క్రమంలో మొదటి సారి అమ్మాయికి గర్భం దాల్చింది.. అయితే యువతిని పెళ్లి చేసుకోంటానని నమ్మించి.. తన ఫోన్ లో ఉన్న వీడియోలు చూపించి లొబరుచుకున్నాడు..అవసరమయితే నీ శవాన్ని కూడా దొరక్కుండా గల్లంతు చేయగలనని బెదిరించి ఆమెను మానసికంగా చిత్రహింసలు చేసిడు.. మళ్లీ లైగింకంగా వేధించసాగాడు. ఈ క్రమంలో రెండవ సారి ఆమే గర్భం దాల్చింది. దీంతో బాధిత యువతికి రెండవ సారి కూడా బలవంతంగా అబార్షన్ చేయించాడు.

తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరితో చెప్పకుండా తనలో తానే కృంగిపోయేది..తాన జీవితం నాశనం చేసినవాడి పెళ్లి చేసుకోమని అడిగింది బాధితురాలు.. తనకు 7 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని..తెగేసి చెప్పాడు. అయితే తనకు జరిగిన అన్యాయాన్ని పీఎస్ ఫిర్యాదు చేయాగా ఘటన జరిగిన పరిధిలో ఉన్న స్టేషన్ లో ఫిర్యాదు చేయమని వెనక్కిపంపించారు. దీంతో బాధిత యువతు తనకు జరిగిన అన్యాయాన్ని విశాఖ సీపీ కి వాట్సప్ వీడియో రూపంలో పంపింది. దీంతో విషయం తెలుసుకున్న జగదీశ్వరరావు యువతి వద్దకు వెళ్లి ఆమేను చిత్ర హింసలుకు గురిచేసి బలవంతంగా రెండు సార్లు హత్యచారం చేశాడు.

ఒక్క రోజు న తనకు తానే ధైర్యం తెచ్చుకొని నన్ను పెళ్లిచేసుకోవాలి అని మళ్ళీ అమ్మాయి జగదీశ్వర్ రావుపై ఒత్తిడి తీసుకోని రావడం తో జగదీశ్వర్ రావు అమ్మాయికి ఏడు లక్షలు కట్నం తీసుకోని వస్తే నేను పెళ్లి చేసుకొంటాను లేకపోతే నన్ను ఏమి చేయలేవు, నాకు పోలీసు లు తోను రాజకీయ నాయకులుతో పరిచయాలున్నాయి నన్ను ఏమి చేయలేవు నాకు చాలా సపోర్ట్ ఉన్నది అని చెప్పాడు. ఘటనపై హో మంత్రి సుచరిత స్పందించారు..బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని హామి ఇస్తారు.

ఇది కూడా చదవండి: మినరల్ వాటర్ తాగొచ్చా..?

Advertisement

తాజా వార్తలు

Advertisement